ప్రభుత్వ ఆస్పత్రులలో ఔట్ పేషెంట్ల కోసం నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) ఓపీ రిజిస్ట్రేషన్ను మరింత సులభంగా మార్చేసేందుకు క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలోని రెండు ప్రభుత్వ ఆస్పత్రులలో సూపర్ఫాస్ట్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హాస్పిటల్ కౌంటర్లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పేషంట్ పేరు, తండ్రి పేరు తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొన్ని నిమిషాల్లో అదే ఫోన్కు ఓ టోకెన్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ కౌంటర్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది. ఆ టైంలో పేషంట్ డైరెక్ట్గా కౌంటర్ వద్దకు వెళ్లి డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఔట్పేషంట్ స్లిప్ తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ను ఫోన్ కెమెరా, ఏబీహెచ్ఏ, ఆరోగ్య సేతులాంటి యాప్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎ)లో భాగంగా ఎన్హెచ్ఏ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా లేడీ హార్డింగ్మెడికల్ కాలేజీ(ఎల్హెచ్ఎంసీ), శ్రీమతి సుచిత క్రిప్లానీ హాస్పిటల్(ఎస్ఎస్కేహెచ్)లోని ఓపీ డిపార్ట్మెంట్స్లో ఈ క్యూఆర్ కోడ్లను ఇన్స్టాల్ చేశారు. స్మార్ట్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సేవలు మెరుగైన ఫలితాలిస్తే.. మరిన్ని ఆస్పత్రులలో అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్హెచ్ఏ సీఈవో డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. వైద్యసేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. 15 రోజుల్లో 2,200 మందికి పైగా పేషంట్స్ ఈ సేవలను పొందినట్టు తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులలో క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్
October 08, 2022
0
Tags