బీహార్లోని బాంకాలో బెల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝుంకా గ్రామానికి చెందిన నాగో సింగ్ సహా మరో ఐదుగురిపై 1996లో పంట తగలపెట్టారని కేసు నమోదైంది. వీరందరూ కొంతకాలం విచారణ ఖైదీలుగా జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు. తాము నిర్దోషులమంటూ గత 26 ఏళ్లుగా పోరాడుతున్నారు. తాజాగా బుధవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును విన్న నాగో సింగ్ (76) ఆనందాన్ని తట్టుకోలేక అక్కడే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన అధికారులు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్ధరించారు. మృతుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు.
ఆనందం తట్టుకోలేక అనంత లోకానికి.....!
October 21, 2022
0
Tags