భార్య మీద కోపంతో నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు !

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని జలంధర్‌లో పరంజిత్ కౌర్ తన ఇద్దరు మైనర్ పిల్లలను తీసుకుని ఐదారు నెలల క్రితం తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తనను, తన పిల్లలను తన భర్త కుల్దీప్ సింగ్ కొట్టేవాడన్న కారణంతో లూధియానాలోని ఖుర్షేద్‌పూర్ గ్రామంలోని తన భర్త ఇంటికి వెళ్లడానికి ఆమె నిరాకరించింది. సోమవారం రాత్రి కుల్దీప్, మరో ఇద్దరు వ్యక్తులతో కలసి పరంజిల్ కౌర్ ఇంటికి వచ్చి నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మృతులను పరంజిత్ కౌర్, ఆమె తండ్రి సుర్జన్ సింగ్, తల్లి జోగీందరో, పిల్లలు అర్షదీప్(8), అన్మోల్(5)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)