కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నాలాలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కేఆర్ పురంలోని ఎస్ఆర్ లే అవుట్లో అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు బృహత్ బెంగళూరు మహానగర్ పాలిక అధికారులు చేరుకున్నారు. అక్కడ నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు బుల్డోజర్ వచ్చింది. దీంతో ఆ ఇంటి దంపతులు సునీల్ సింగ్, సోనా సేన్ కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. ఇక సోనా సేన్ అగ్గిపుల్ల కూడా వెలిగించింది. కానీ అదృష్టవశాత్తు ఆ అగ్గిపుల్ల వెలగలేదు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు కలిసి వారిపై నీళ్లు గుమ్మరించి, ప్రాణాలతో కాపాడారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ సింగ్, సోనా సేన్ మాట్లాడుతూ తమ ఇంటిని అక్రమంగా నిర్మించుకోలేదన్నారు. తమ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు, పోలీసులు వినిపించుకోకుండా ఇంటిని కూల్చేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.
Post Top Ad
adg
Wednesday 12 October 2022
Home
bengalore
Criem
karnataka
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం !
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం !
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం !
Tags
# bengalore
# Criem
# karnataka
# ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం !
About Telugu Lo Computer
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment