ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం,సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అకస్మాత్తుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించారు. కొన్ని గంటలుగా ఆయనకు వెంటిలేటర్ పై డాక్టర్లు చికిత్స అందించారు.  ట్రీట్మెంట్ కు ఆయన శరీరం స్పందించలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల సోమవారం కన్నుమూశారు.  దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన  ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాలను శాసించారు. మూడుసార్లు యూపీ సీఎంగా​, ఒకసారి కేంద్రంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)