ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు దుబాయి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లాడు. అయితే పాస్పోర్టు, వీసా వివరాలు సరిగా లేకపోవడంతో ఎయిర్పోర్టు అధికారులు అతన్ని వెనక్కి పంపారు. దీంతో తిరుగు ప్రయాణంలో అతను హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు. పాలకొల్లు పట్టణం సమీపంలోకి బస్సు రాగానే ఉన్మాదిలా మారిపోయాడు. గల్ఫ్ వెళ్ళడానికి తీసుకెళ్లిన 2కేజీలు కారం బ్యాగ్లో ఉండటంతో 18మంది ప్రయాణికులు, చిన్న పిల్లలపై దానిని చల్లాడు. దీంతో వారందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఇదే సమయంలో రాంబాబు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రయాణికులు పట్టుకొని పాలకొల్లు బస్ స్టేషన్ లో పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ విమానాశ్రయం అధికారులు పాస్పోర్టు సరిగాలేదని వెనక్కి పంపారని తీవ్ర నిరాశకు గురైన రాంబాబు ప్రయాణికులపై కారం చల్లాడని పోలీసులు తెలిపారు.
ప్రయాణికులపై కారం చల్లిన యువకుడు !
October 10, 2022
0
Tags