నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ధి రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల పలు పట్టణాలు, గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వివిధ ప్రమాదాల్లో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సాయం కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విపత్తు అని అక్కడి అధికారులు తెలిపారు. దాదాపు 10 ఏళ్ల క్రితం సంభవించిన వరదల్లో 360 మంది ప్రాణాలు కోల్పోగా.. 2లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. దాదాపు 2లక్షల నివాసాలు దెబ్బతిన్నాయి. దాదాపు 2.72 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వరదలు ముంచెత్తుతున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. నైజీరియాలో ప్రతీ ఏటా వరదలు సంభవించినప్పటికీ.. ఈసారి మాత్రం భారీ విపత్తు సంభవించింది.
Post Top Ad
adg
Monday 17 October 2022
Home
2.72 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం
600 మంది ప్రాణాలు కోల్పోయారు
International
నైజీరియాని ముంచెత్తిన వరదలు
నైజీరియాని ముంచెత్తిన వరదలు
నైజీరియాని ముంచెత్తిన వరదలు
Tags
# 2.72 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం
# 600 మంది ప్రాణాలు కోల్పోయారు
# International
# నైజీరియాని ముంచెత్తిన వరదలు
About Telugu Lo Computer
నైజీరియాని ముంచెత్తిన వరదలు
Tags
2.72 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం,
600 మంది ప్రాణాలు కోల్పోయారు,
International,
నైజీరియాని ముంచెత్తిన వరదలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment