వేదికపై కుప్పకూలిన రిటైర్డ్ ప్రొఫెసర్ !

Telugu Lo Computer
0


బీహార్‌లోని చప్రా జిల్లాలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ మతపరమైన కార్యక్రమంలో వేదికపై కుప్పకూలి గుండెపోటుతో మరణించారు. ప్రొఫెసర్ రణంజయ్ సింగ్, మతపరమైన కార్యక్రమం జరిగిన మారుతీ మానస్ దేవాలయానికి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన రిటైర్డు ప్రొఫెసర్ వేదికపై మాట్లాడుతూనే కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. రణంజయ్‌ సింగ్ వేదికపై మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయారు. హుటాహుటాన ఆస్పత్రి తరలించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటు రావటంతోనే మరణించినట్లు తెలిపారు. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)