దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావుని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన్ను ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచారం. లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ తర్వాత అభిషేక్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. అభిషేక్ రావుకి తొమ్మిది కంపెనీలతో సంబంధం వుంది. కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం తొమ్మిది కంపెనీల్లో అభిషేక్ రావు వాటాలు కలిగి వున్నారని అధికారులు తెలిపారు. ఆ తొమ్మిది కంపెనీల్లో వివిధ రకాల వ్యాపారాలు వున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ క్వారీయింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్ మరియు కెమికల్ ప్రొడక్స్ట్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసులు వున్నాయి.
లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు అరెస్టు
October 10, 2022
0
Tags