పైప్‌ బాంబ్‌ స్వాధీనం

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు సుమారు పది కిలోల బరువైన పైప్‌ ఐఈడీను స్వాధీనం చేసుకొని, అక్కడికక్కడే సైనికులు పైప్‌బాంబ్‌ను నిర్వీర్యం చేశారని అంతగఢ్‌ ఎస్‌డీఓపీ అమర్‌ సిదర్‌ తెలిపారు. కోయలిబెడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అంతఘర్‌ – టేకపాని గ్రామంలో భద్రతా బలగాలు పెట్రోలింగ్‌ చేరపడుతున్నారు. దీంతో బలగాలే లక్ష్యంగా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఐఈడీని అమర్చినట్లు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. నక్సల్స్‌ అమర్చిన ఐఈడీ పైపును స్వాధీనం చేసుకొని, ధ్వంసం చేసినట్లు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)