గీజర్ పేలి ఇద్దరు డాక్టర్లు మృతి !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధి, ఖాదర్‌బాగ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ తో నవదంపతులు మృతి చెందారు. సయ్యద్ నిసరుద్దీన్ సూర్యాపేట ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య ఉమ్మే మొహిమీన్ సైమా దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఖాదర్‌బాగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దంపతులు ఉంటున్నారు. ఉమ్మే మొహిమీన్ సైమా తండ్రి అబ్దుల్ అహద్ తన కుమార్తెను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి అతను ఫ్లాట్‌కి చేరుకున్నాడు. సయ్యద్ నిసరుద్దీన్.. అతని భార్య ఉమ్మె మొహిమీన్ సైమా ఇద్దరూ బాత్రూంలో చనిపోయి ఉండటాన్ని గమనించి  స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గీజర్ నుండి మహిళకు మొదట విద్యుత్ షాక్ తగిలిందని, అతనికి భార్య నిసరుద్దీన్‌ను రక్షించే ప్రయత్నంలో షాక్ తగిలిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)