అణు సామర్థ్యంగల ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం

Telugu Lo Computer
0


ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్  నుంచి అణు సామర్థ్యంగల ఈ క్షిపణిని ప్రయోగించారు. పరీక్ష లక్ష్యాలన్నిటినీ అత్యంత కచ్చితత్వంతో  ఛేదించింది. వరుసగా మూడోసారి నిర్వహించిన ఈ పరీక్షలు ఈ వ్యవస్థ కచ్చితత్వాన్ని, విశ్వసనీయతను నిరూపించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ వంటి అనేక ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ పనితీరును మదింపు చేసినట్లు తెలిపారు. ఈ సిస్టమ్స్‌ను వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెర్మినల్ పాయింట్ వద్ద రెండు డౌన్-రేంజ్ నౌకలు సహా ఫ్లైట్ పాత్‌లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మిసైల్ మొదటి రెండు పరీక్షలు గత ఏడాది జూన్, డిసెంబరు నెలల్లో జరిగాయని, ఈ రెండు పరీక్షల్లోనూ ఈ మిసైల్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించిందని తెలిపారు. అగ్ని క్లాస్ మిసైల్స్‌లో అగ్ని ప్రైమ్ (అగ్ని-పీ) నవతరానికి సంబంధించిన అత్యాధునికమైనది. ఇది అణు సామర్థ్యం కలది కూడా. దీని పరిధి 2,000 కిలోమీటర్లు.

Post a Comment

0Comments

Post a Comment (0)