విజయవాడ అగ్ని ప్రమాదంలో ఇద్దరి సజీవదహనం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ  గాంధీనగర్ జింఖానా గ్రౌండ్ లో, రాత్రి గవర్నర్ పేటలో అర్దరాత్రి ఫకీర్ గూడెంలో భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. జింఖానా గ్రౌండ్సలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం కావడం అందరినీ కలచివేసింది. ఇదిలా ఉంటే.. నిన్న అర్థరాత్రి ఫకీర్ గూడెంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా నిప్పురవ్వలు పడడంతో 15 ఇళ్లు దగ్దమయ్యాయి. మొదట ఒక ఇంటికి నిప్పు అంటుకోవడంతో  స్దానికులు మంటను అదుపు చేసేలోపే వేగంగా మిగిలిన ఇళ్లకు మంటల వ్యాపించాయి. దీంతో వరుసగా ఉన్న 15 ఇళ్లు అగ్నికి అహుతయ్యాయి. అగ్ని మాపక సిబ్బంది, స్థానికులు చొరవతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)