ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జిల్లా లోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై స్లీపర్ బస్ ఓ ట్రక్ ను ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. 46 మంది ప్రయాణికులతో స్లీపర్ బస్ గోరఖ్పూర్ నుంచి అజ్మీర్ షరీఫ్కు బయలుదేరగా బస్సు డ్రైవర్ నిద్రమత్తులో వాహనంపై అదుపు తప్పాడు. దీంతో బస్ ఎదురుగా వస్తున్న ఇసుక ట్రక్ను ఢీకొంది. స్థానికులు ఈ సమాచారం తెల్పడంతో అధికారులు ప్రమాదస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ట్రక్ను ఢీకొన్న స్లీపర్ కోచ్ ఘటనలో నలుగురు మృతి
October 23, 2022
0
Tags