వరల్డ్కప్ మ్యాచ్లో పాకిస్థాన్పై విరాట్ కోహ్లి వీరోచిత పోరాటం చేసి భారత్కు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ గ్రేట్ ఇన్నింగ్స్ నుంచి మనమంతా ఐదు విషాయాలు నేర్చోవాలని ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ తెలిపారు . ఇందుకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఆయన చెప్పినట్లు ఈ ఐదు విషయాలు కోహ్లి ఇన్నింగ్స్ నుంచి అందరూ నేర్చుకోవచ్చు. పాక్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయతీరాలకు చేర్చాడు కోహ్లి. మ్యాచ్ పూర్తయాక భావోద్వానికి లోనయ్యాడు. తన కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడినట్లు చెప్పాడు.
పంచ సూత్రాలు :
1. చెడు కాలం శాశ్వతం కాదు
2. మన పనితీరు ద్వారా మాత్రమే సమాధానం ఇవ్వబడుతుంది
3. చివరి నిమిషం వరకు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి
4. వ్యక్తుల జ్ఞాపకశక్తి చాలా తక్కువ
5. విశ్వాసం పెరిగినప్పుడు, క్లిష్ట పరిస్థితులు కూడా సులభంగా కనిపిస్తాయి