గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,994 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 4.46కోట్లు దాటగా.. కరోనా మహమ్మారి నుంచి 4.40కోట్లకు పైగా బాధితులు కోలుకున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 5,28,961 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 23,432 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 219.55కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
కొత్తగా 1994 కరోనా కేసులు నమోదు !
October 23, 2022
0
Tags