బుగ్గన కు చేదు అనుభవం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ  గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. వైసీపీ  మంత్రులు, నేతలకు నిరసన సెగలు తప్పడం లేదు. తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి ఓ సాధారణ గృహిణి షాక్ ఇచ్చింది. ప్రజలకు ప్రభుత్వం అంత ఇచ్చింది, ఇంత ఇచ్చింది, సంక్షేమానికి ఇంత కేటాయించాం అంటూ మంత్రి బుగ్గన  ఆమెకు లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ మహిళ అదే స్థాయిలో మంత్రిని నిలదీసింది. ఆమె వరుస పెట్టి ప్రశ్నలు అడగడంతో మంత్రితో పాటు.అక్కడి అధికారులు కూడా షాక్ కు గురయ్యారు. గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గం లోని ప్రజల చెంతకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మహిళ నుంచి ఊహించని నిరసన ఎదురైంది. ఒక్కో కుటుంబం కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన ఆమె కు వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వెంటనే సామాన్య ప్రజల దగ్గర తీసుకున్న సొమ్మునే కదా తిరిగి ఇస్తున్నారు అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేసింది. ఆమె ఎదురు ప్రశ్నతో షాక్ కు గురైన మంత్రి వెంటనే తేరుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా, ఆమె వెనక్కు తగ్గలేదు. వంట నూనె నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలు పెరిగాయి కదా అంటూ ప్రశ్నించింది. దానికి మంత్రి సమాధానం ఇస్తూ.. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెరిగిందని.. హైదరాబాద్ లోనూ అదే రేట్లు ఉన్నాయని వివరించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె ప్రశ్నిస్తుండడంతో అసలు మీకు వినే ఉద్దేశం లేదమ్మా అంటూ మంత్ర కాస్త విసుక్కున్నారు. చెత్త పేరుతో కూడా పన్నులు బాదేస్తూ.. డబ్బులు ఇస్తున్నామంటే ఎలా అంటూ మరింత వాయిస్ పెంచే ప్రయత్నం చేసింది. దీంతో ఇంక ఏం చెప్పాలో తెలియక.. ఆర్థికమంత్రి బుగ్గన ఇతర అధికారులు అక్కడ నుంచి వెను తిరిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)