వాణిజ్య సిలీండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్ పీజీ సిలీండర్ పై రూ. 36 తగ్గిస్తూ చమురు సంస్థలు తెలిపాయి. నేటి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి. గతంలో 19 కేజీల సిలిండర్ రూ.2012.50 ఉండేది. తాజాగా తగ్గిన ధరతో రూ.1976.50కి అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, గతంలో కోల్కతాలో రూ. 2132.00కి అందుబాటులో ఉండగా, ఆగస్టు 1 నుంచి రూ. 2095.50కి అందుబాటులోకి వస్తోంది. వాణిజ్య సిలిండర్ ధర నేటి నుంచి ముంబైలో రూ.1936.50కి, చెన్నైలో రూ.2141కి తగ్గింది. నిన్నటివరకు వాణిజ్య సిలీండర్ ధరలు భారీగా ఉండటంతో హోటల్స్, టీ దుకాణాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా సిలీండర్ పై రూ. 36 తగ్గుదలతో వారికి కొంత ఉపశమనం లభించినట్లయింది. మరోవైపు గృహ వినియోగదారులు వినియోగించే 14.2 కేజీల సిలీండర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
ధర తగ్గిన వాణిజ్య సిలిండర్
August 01, 2022
0
Tags