తనకు కోవిడ్ సోకిందని, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానని అడివి శేష్ తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. ఈరోజు విడుదలైన బింబిసార.. సీతారామం సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం అంటూ రాసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఇక తాజాగా ఆయన హీరోగా వచ్చిన మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
అడివి శేష్కు కరోనా
August 05, 2022
0