తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో బైక్ పై వెళ్తున్న యువకుడిపై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామిగా గుర్తించారు. స్వామి మునుగోడులో జనరల్ కిరాణ స్టోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రోజువారీగా సాయంత్రం సమయంలో దుకాణం కట్టేసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతనిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్వామికి గాయాలు కాగా స్థానికులు అతనిని కామినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఘటన స్థలంలో ఓ బుల్లెట్ గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మునుగోడు లో యువకుడిపై కాల్పులు
August 05, 2022
0
Tags