వృద్ధుడిని స్తంభానికి కట్టేసి కొట్టి చంపారు !

Telugu Lo Computer
0


ఒడిశాలో కోరాపూట్ జిల్లాలోని ఒక గిరిజన ప్రాంతంలో కుర్షా మనైకా అనే వృద్ధుడికి, అతడి కొడుకు, సోదరుడికి మధ్య గొడవ తలెత్తింది. ఈ గొడవ సందర్భంగా కొడుకు ఇంటి పైకప్పుల్ని కుర్షా ధ్వంసం చేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న కుర్షా కొడుకు, కోడలు, తమ్ముడు కలిసి అతడ్ని ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేశారు. పెద్ద కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. కుర్షాను కట్టేయడం వల్ల నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. కాళ్లపై కొడుతుంటే, కాళ్లు పైకి లేపి రక్షించుకునే ప్రయత్నం చేశాడు. అతడు ఎంతగా బతిమాలుతున్నా వినకుండా, దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జరుగుతుండగా కొందరు వీడియో తీశారు. ఘటనకు సంబంధించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్ధుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. కుర్షా పోస్టుమార్టమ్ తర్వాత పోలీసులే, గ్రామస్తులతో కలిసి అతడి అంత్యక్రియలు నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)