దేశంలో గత 24 గంటల్లో 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,35,510 (0.31 శాతం) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 6.14 శాతం ఉండగా, రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899 కి పెరిగింది. మరణాల సంఖ్య 5,26,730 కి చేరింది. నిన్న కరోనా నుంచి 15,549 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,34,99,659 కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 206.56 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
దేశంలో కొత్తగా 16,167 కరోనా కేసులు నమోదు !
August 08, 2022
0
Tags