బాలికకు వోడ్కా తాగించిన టీచర్ !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని రాజ్‌కోట్ సిటీ, నిజాంపురా ప్రాంతంలోప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి ట్యూషన్ క్లాసులు చెబుతుండే వాడు. బుధవారం రాత్రిపూట ట్యూషన్ ముగిసిన తర్వాత, ఒక పదో తరగతి విద్యార్థినిని ఆల్కహాల్ తీసుకోమని బలవంతం చేశాడు. తనతోపాటు కూర్చొని వోడ్కా తాగాలి అని కోరాడు. బలవంతంగా ఆ బాలికకు వోడ్కా తాగించాడు. తర్వాత ఆ బాలిక స్పృహ కోల్పోయింది. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మత్తులో ఉన్న బాలికను ఇంటి దగ్గర దింపేశాడు. బాలిక తల్లిదండ్రులు ఆమె పరిస్థితి చూసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తర్వాత కోలుకుంది. జరిగిన ఘటన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్‌ను అరెస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)