ఉత్తర ప్రదేశ్లో తాజాగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి తగ్గిన విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ప్రతి స్లాబ్లోనూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ యూనిట్కు యాభై పైసల నుంచి ఒక్క రూపాయి వరకు ఈ తగ్గింపు అమలు కానుంది. అయితే, గృహ వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. దీని ద్వారా దాదాపు కోటి మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది. మరోవైపు ఇప్పటివరకు అమలవుతున్న యూనిట్కు ఏడు రూపాయల స్లాబ్ను పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అన్ని స్లాబుల్లో కలిపి అత్యధిక యూనిట్ రేటు రూ.6.50గా నిర్ణయించారు. ఈ మార్పులకు సంబంధించిన నిర్ణయాన్ని గత నెల 23నే తీసుకున్నప్పటికీ ఈ నెల 4 నుంచి అమల్లోకి తెచ్చారు. తాజా నిర్ణయం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వంద యూనిట్లలోపు యూనిట్కు రూ3.35, 100-150 యూనిట్ల వరకు యూనిట్కు రూ.3.85, 151-300 యూనిట్ల వరకు యూనిట్కు రూ.5.00, 300 పైన యూనిట్లకు యూనిట్కు రూ.5.50గా నిర్ణయించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా యూనిట్కు రూ.6.50గా ఉంది.
ఉత్తర ప్రదేశ్లో గృహ వినియోగ విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
August 05, 2022
0
Tags