రాజస్థాన్లోని డూంగర్పుర్, జింజ్వా ఫాలా గ్రామంలో శంకర్ తన కుటుంబంతో నివాసముంటున్నాడు. తన ఇంట్లో సోమవారం తెల్లవారుజామున దశ మాత అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తున్నాడు. గ్రామస్థులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదే సమయంలో శంకర్ కుమార్తె.. అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న కత్తిని తీసుకుని వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమెను అదుపు చేసేందుకు శంకర్తోపాటు అతడి అన్నయ్య సురేశ్ తీవ్రంగా ప్రయత్నించారు. వారిని కత్తితో గాయపరచడంతో శంకర్ కుటుంబసభ్యులంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ఆ బాలిక ఇంట్లోకి వెళ్లి అక్కడ నిద్రిస్తున్న సురేశ్ తొమ్మిదేళ్ల కుమార్తె పుష్ప తలను నరికేసింది.
అమ్మవారి అవతారాన్నంటూ చెల్లి తల నరికిన బాలిక !
August 02, 2022
0
Tags