బీహార్ లోని దుర్భంగా జిల్లా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం (ఎల్ఎన్ఎంయు) అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థికి ఓ పేపర్లో 100కి 151 వచ్చాయి. మార్కుల లిస్ట్ చూసుకున్న విద్యార్థి ఒక్కసారిగా కంగుతిన్నాడు. యూవర్సిటీలో పార్ట్-2 పరీక్షలో బీఏ విద్యార్థి తన పొలిటికల్ సైన్స్ పేపర్-4లో 151 మార్కులు సాధించినట్లు ఆదివారం తెలిపాడు. అయితే ఆ “ఫలితాలు చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నాడు. ఇది తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ, ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దాన్ని తనిఖీ చేసి ఉండాలని అతను చెప్పాడు. బికామ్ పార్ట్-2 పరీక్షలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ పేపర్-4లో సున్నా సాధించిన మరో విద్యార్థి తదుపరి తరగతికి పదోన్నతి పొందాడు. అయితే ఇలా 100కు 151 మార్కులు రావటానికి కారణం టైపింగ్ లోపమేనని విశ్వవిద్యాలయం అధ్యాపకులు పేర్కొన్నారు. ఆ మార్కులను సవరించి మళ్లీ కొత్త మార్కుల షీట్ ను జారీ చేసినట్లు విద్యార్థి తెలిపాడు. వర్సిటీ రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రెండు మార్క్షీట్లలో టైపింగ్ తప్పులు ఉన్నాయని చెప్పారు. “టైపోగ్రాఫికల్ లోపాలను సరిదిద్దిన తరువాత, ఇద్దరు విద్యార్థులకు తాజాగా మార్కుల షీట్లు జారీ చేయడం జరిగిందని, అవి కేవలం టైపోగ్రాఫికల్ తప్పులేనని చెప్పారు.
Post Top Ad
adg
Monday, 1 August 2022
Home
100కు 151 మార్కులు ?.Bihar
టైపోగ్రాఫికల్ తప్పులే
మళ్లీ కొత్త మార్కుల షీట్ ను జారీ
లలిత్ నారాయణ్ మిథిల విశ్వవిద్యాలయం
100కు 151 మార్కులు ?
100కు 151 మార్కులు ?
Tags
# 100కు 151 మార్కులు ?.Bihar
# టైపోగ్రాఫికల్ తప్పులే
# మళ్లీ కొత్త మార్కుల షీట్ ను జారీ
# లలిత్ నారాయణ్ మిథిల విశ్వవిద్యాలయం
About Telugu Post
లలిత్ నారాయణ్ మిథిల విశ్వవిద్యాలయం
Tags
100కు 151 మార్కులు ?.Bihar,
టైపోగ్రాఫికల్ తప్పులే,
మళ్లీ కొత్త మార్కుల షీట్ ను జారీ,
లలిత్ నారాయణ్ మిథిల విశ్వవిద్యాలయం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment