అరవింద్ కాన్వాయ్‌పై దాడి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయనను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అరవింద్ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. మరోసారి గ్రామస్తులు అడ్డుకోవడంతో తిరుగుపయమయ్యారు అరవింద్‌. అయినా వారు అడ్డుకున్నారు. కాన్వాయ్ కు అడ్డువచ్చిన గ్రామస్తులను పోలీసులు తప్పించి అరవింద్ కాన్వాయ్ ను ముందుకు పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఎంపీ కాన్వాయ్ పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో రెండు వాహనాల అద్ధాలు ధ్వంసమయ్యాయి. కాగా, గ్రామస్తుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)