పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, దీక్షలు, నిరసనలు నిషేధం !

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను అనుమతి లేదని  సర్క్యూలర్‌ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. జూలై 18 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోడీ ఈ కొత్త ఆదేశాలను ఓ బులెటిన్‌లో తెలిపారు. సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రక్రియ సాధారణమైనదని పార్లమెంట్ అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాదు.. పార్లమెంటు ప్రతి సమావేశానికి ముందు మార్గదర్శకాలు జారీ చేస్తారని స్పష్టం చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)