ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతం నుండి కొన్ని షాకింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. కుక్క మొరిగిందనే కోపంతో ఒక వ్యక్తి ఇనుప రాడ్తో ఇరుగు పొరుగు వారిపై దాడి చేశాడు.అంతటితో ఆగకుండా నిందితుడు కుక్కను కూడా రాడ్తో కొట్టి చంపేశాడు. స్థానికులు వద్దని వారించినప్పటికీ అతడు ఆగలేదు. మరింత రెచ్చిపోయి ప్రవర్తించాడు. అడ్డుపడ్డవారందరినీ విచక్షణారహితంగా చితకబాదాడు. ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వ్యక్తి దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలిసింది. ఈ తతంగమంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఘటన తర్వాత కుక్క యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుక్క అరిచిందని ఐరన్ రాడ్తో దాడి చేసిన వ్యక్తి !
July 04, 2022
0
Tags