ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రమాదకరం

Telugu Lo Computer
0


ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఉచితాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌నూ నిర్మిస్తోందని ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిని ఆయన ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో చిత్రకూట్‌ నుంచి ఢిల్లీకి ప్రయాణం 3, 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్‌ పరుగులు పెడుతుందన్నారు. యోగి ఆదిత్యనాథ్ ​నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు మెరుగపడటమేకాకుండా, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. ఇదంతా డబుల్‌ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యమవుతోందని పేర్కొన్నారు.  296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ రహదారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు ఉండగా ప్రస్తుతం ఆరు లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)