దేశ వ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ వేడుకలు జరుపుకుంటున్నారు.  మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, జహంగీర్ పురి మసీదు, సీలంపూర్ ఉమర్ మసీదు, ఫతేపురి మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ”దేశ ప్రజలందరికీ ముఖ్యంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. త్యాగం, సేవకు చిహ్నంగా ఈ పండుగ నిలుస్తుంది. సేవకు మనల్ని మనం అంకితం చేసుకుని దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దాం” అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. బక్రీద్ పండుగ మానవాళి మంచి కోసం కృషి చేయడానికి మనలో స్ఫూర్తిని మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)