దేశంలో గత 24 గంటల్లో 18,257 కొత్త కేసులు, 42 మరణాలు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,28,690 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. వాటి శాతం 0.30గా ఉన్నట్లు వివరించింది. ఇప్పటి వరకు మొత్తం 4,36,22,651 కేసులు, 5,25,428 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అలాగే, 98.50 శాతంగా కరోనా రికవరీ రేటు ఉందని పేర్కొంది. నిన్న కరోనా నుంచి 14,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,68,533గా ఉందని వివరించింది.
దేశంలో 18,257 కొత్త కేసులు నమోదు
July 10, 2022
0