మైనర్‌ బాలికపై అత్యాచారం

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ అనే గ్రామంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరి ఇంటి పక్కనే ఓ మైనర్ బాలిక ఉండేది. పక్కింటి వారు కావడంతో ఆ బాలిక తరచూ వీరి ఇంటికి వస్తూ ఉండేది. ఈ క్రమంలో భర్త కన్ను ఆ బాలికపై పడగా, కోరిక తీర్చుకోవడం కోసం పథకం వేశాడు. దీనికి తన భార్య సహాయం కోరాడు. ఆమె అడ్డు చెప్పకుండా సరేనని ఒప్పుకొని బాలికను ఇంటికి పిలిచింది. మాట్లాడుతూ బాలికను భర్త ఉన్న గదిలోకి తోసేసిసి, భర్త బాలికపై అత్యాచారం చేస్తుండగా, భార్య ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీసింది. తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. దాంతో భయపడిన బాలిక రెండ్రోజులు ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అయితే రెండ్రోజుల తర్వాత భార్యాభర్తలు అకస్మాత్తుగా వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం అందరికీ తెలిసిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు బాలికను నిలదీయగా, అసలు విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పోక్సో చట్టం కింద కేసు పెట్టి దంపతులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)