మహిళా టీచర్లను రహస్యంగా వీడియో తీసిన హెడ్మాస్టర్ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌ లోని బరేలీ జిల్లా ఫరీద్‌పూర్‌లో సైదాపూర్ ప్రైమరీ పాఠశాల హెడ్మాస్టర్ అయిన ఖుర్షీద్ అలీ తమను రహస్యంగా వీడియో తీసినట్టు మహిళా టీచర్లు ఆరోపిస్తున్నారు. హెడ్మాస్టర్ చర్యను నిరసిస్తూ ఉపాధ్యాయినులు ఆందోళనకు దిగారు. దీంతో కోపంతో ఊగిపోయిన హెడ్మాస్టర్ అలీ వారిని దుర్భాషలాడుతూ వారిపై రాళ్లు విసిరారు. అంతేకాక, వారి నుంచి సెల్‌ఫోన్లు కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఘటన విద్యార్థుల ముందే జరగడం గమనార్హం. ఆ తర్వాత ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు బేసిక్ శిక్ష అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ ఖుర్షీద్ అలీ మాట్లాడుతూ.. టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పకుండా ల్యాప్‌టాప్‌లలో పనిచేసుకుంటున్నారని, ఉన్నతాధికారులకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసేందుకే వీడియో తీశానని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)