భారీ పేలుడులో ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


బీహార్ లోని సరన్ జిల్లా ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుదాయి బాగ్ గ్రామంలో వ్యాపారి షబీర్ హుస్సేన్‌ ఇంట్లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటిలోని కొంత భాగం దగ్ధం కాగా మిగిలిన భాగం మంటల్లో చిక్కుకుంది. పేలుడు సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, ఫైరింజన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్న అధికారులు వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖదాయి బాగ్ గ్రామం జిల్లా కేంద్రమైన ఛప్రా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పేలుడుకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను కూడా పిలిపించామని సరన్ ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపారు. వ్యాపారి షబ్బీర్ హుస్సేన్ ఇంట్లో బాణాసంచా వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. పేలుడు జరిగిన ఇంట్లోనే బాణాసంచా తయారు చేశారని, గంటపాటు పేలుళ్ల శబ్ధాలు నిరంతరం వినిపించాయని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)