భార్యకు విడాకులిచ్చి ఇంటి నుంచి గెంటేసిన భర్త !

Telugu Lo Computer
0


భోపాల్‌కు చెందిన 28 ఏళ్ల హిందూ మహిళకు ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం ఆమె ముస్లిం మతంలోకి మారింది. పెళ్లైన కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త స్నేహితుడు హసీబ్ సిద్ధిఖీ, ఆ దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌ 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఆ మహిళ జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పింది. అయితే అతడు తన స్నేహితుడిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. భార్యపై అత్యాచారం చేసిన సిద్ధిఖీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పైగా భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు ఇండోర్‌కు వెళ్లింది. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇండోర్‌ పోలీసులు ఆ కేసును భోపాల్‌లోని గౌతమ్ నగర్ ప్రాంతం పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)