టీఆర్ఎస్ వినూత్న ప్రచారం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ ఏర్పాటు చేసిన బోర్డుతో మొదలైన వివాదం.. ఇప్పుడు తారా స్థాయికి చేరింది. బీజేపీ కౌంటర్‌కు ఇస్తూ వినూత్న ప్రచారం చేస్తోంది టీఆర్ఎస్. నగరంలో దొంగలు సంచరిస్తున్నారంటూ.. కౌంటర్ ఇస్తున్నారు. హైదరాబాద్‌లో కొంత మంది వ్యక్తులు దొంగల గెటప్‌ వేసుకొని.. బ్యాంకుల ముందు నిలబడుతున్నారు. వారి చేతిలో ఓ ప్లకార్డు కనిపిస్తోంది. 'మేం బ్యాంకులను మాత్రమే దోచుకుంటాం.. కానీ మరు దేశాన్నే దోచుకుంటున్నారు.' అని దానిపై రాసి ఉంది. దానితో పాటు బై బై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ రాశారు. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఎల్ఐసీ కార్యాలయాలు, రైల్వే స్టేషన్ల ముందు ఇలాంటి ప్లకార్డులు పట్టుకొని కొందరు వ్యక్తులు తిరుగుతున్నారు. వారిని టీఆర్ఎస్ పార్టీయే పంపించిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)