ఢిల్లీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లను ఉచితంగా పూరి జగన్నాథ్ యాత్రకు తీసుకెళ్లనుంది. రథ యాత్రలో 2020, 2021లలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా సాధారణ ప్రజానీకాన్ని అనుమతించలేదు. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. యాత్ర జులై 1నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద పెద్ద వయస్కులైన వారిని జులై 11 నుంచి జులై 28వరకూ ఉచితంగా తీసుకెళ్తారు. తీర్థ యాత్ర వికాస్ సమతి చైర్మన్ కమల్ బన్సాల్ మాట్లాడుతూ “సీఎం కేజ్రీవాల్ సూచనల మేరకు సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత తీర్థయాత్ర స్కీం తీసుకొచ్చాం. చారిత్రక యాత్రకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాం. జులై నెలలో యాత్ర కోసం రెండు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి” అని పేర్కొన్నారు.
ఢిల్లీ సీనియర్ సిటిజన్లకు ఉచిత పూరి జగన్నాథ్ తీర్థయాత్ర
July 04, 2022
0
Tags