దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోధైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 13,958 మంది కరోనా నుంచి కోలుకున్నారన్నారని, 24 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో హోం క్వారంటైన్లు/ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 1,13,864గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.85 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటివరకు 4,28,79,477 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల దేశంలో మొత్తం 5,25,223 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 197,98,21,197 కరోనా వ్యాక్సిన్ డోసులను వాడారు. నిన్న 1,78,383 కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు.
దేశంలో 16,135 కరోనా కొత్త కేసులు నమోదు
July 04, 2022
0