కేరళలో విద్యార్థులు వినూత్న నిరసన

Telugu Lo Computer
0


కేరళలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. తిరువనంతపురంలోని ఓ కాలేజీ విద్యార్థులు అబ్బాయిల ఒడిలో అమ్మాయిలు కూర్చొని ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.కాలేజీ సమీపంలోని ఓ బస్ స్టాప్ లో ముగ్గురు కూర్చోగలిగే ఓ బెంచీని మూడు వేర్వేరు కుర్చీలుగా మార్చడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. అబ్బాయిలు పక్కపక్కనే కూర్చోకూడదన్న ఉద్దేశంతోనే కొందరు ఇలా చేశారని తెలుస్తోంది. ఈ మోరల్ పోలీసింగ్ కు వ్యతిరేకంగా విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారని సమాచారం.


Post a Comment

0Comments

Post a Comment (0)