సిరియాపై ఇజ్రాయెల్‌ క్షిపణి దాడి

Telugu Lo Computer
0


సిరియాపై ఇజ్రాయెల్‌ క్షిపణులతో విరుచుకుపడింది. శుక్రవారం తెల్లవారుజామున సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సిరియా రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఆక్రమిత సిరియాలోని గోలన్‌ ప్రాంతం నుంచి దాడి చేశారని వెల్లడించారు. కొన్ని క్షిపణులను సిరియా సైనికులు విచ్ఛిన్నం చేశారని చెప్పారు. ఇంటెలిజెన్స్‌ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని సిరియన్‌ హ్యూమన్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ తెలిపింది. మెజ్జాహ్‌ మిలిటరీ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఓ కార్‌పై కూడా మిసైల్‌ పడిందని వెల్లడించింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)