ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేలు ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరికి పే స్కేలుతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు కలిపిన వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా వివిధ ఖాతా (హెడ్)ల ఏర్పాటుతో పాటు అదనపు బడ్జెట్ కేటాయింపులు చేసింది. ప్రత్యేకించి గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెరిగిన వేతనాలు ఈ నెల నుంచి రానున్నాయి. ఇందుకు అదనపు నిధులను నేడో రేపో విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.
Post Top Ad
adg
Tuesday 26 July 2022
Home
Andhra Pradesh
అదనపు బడ్జెట్ కేటాయింపు
నేడో రేపో జీవో విడుదల
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన జీతాలు !
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన జీతాలు !
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన జీతాలు !
Tags
# Andhra Pradesh
# అదనపు బడ్జెట్ కేటాయింపు
# నేడో రేపో జీవో విడుదల
# సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన జీతాలు !
About Telugu Lo Computer
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన జీతాలు !
Tags
Andhra Pradesh,
అదనపు బడ్జెట్ కేటాయింపు,
నేడో రేపో జీవో విడుదల,
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన జీతాలు !
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment