దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేసుల సంఖ్య ఒక్కసారిగా 20 వేల మార్క్ దాటింది. బుధవారం దేశవ్యాప్తంగా 20,139 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 3,233 కేసులు పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 38 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,36,076 (0.31 శాతం) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 5.10 శాతం పెరగగా, రికవరీ రేటు 98.49 శాతం ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4,36,89,989 కి పెరిగింది. మరణాల సంఖ్య 5,25,557 కి చేరింది. నిన్న కరోనా నుంచి 16,482 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,30,28,356 కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 199.27 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
దేశంలో కొత్తగా 20,139 కేసులు నమోదు !
July 14, 2022
0