పంజాబ్లోని అమృత్సర్కు చెందిన జమాల్ సింగ్ రోడ్డు మీద చిన్న తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆదివారం సెలవని అతడి కుమార్తె హర్సిమ్రన్ కౌర్ తండ్రికి సాయం చేయడానికి తోపుడు బండి దగ్గరకు వెళ్లింది. అదే సమయంలో లాటరీ టికెట్లు అమ్మే ఓ వ్యక్తి వారి దుకాణానికి వచ్చాడు. టికెట్ కేవలం రూ.100 అని, ఒకటి కొనుగోలు చేయమని అతడు చెప్పాడు. అయితే జమాల్ సింగ్ మాత్రం అందుకు నిరాకరించాడు. కానీ అతడి కుమార్తె హర్సిమ్రన్ కౌర్ తన తండ్రిని ఒప్పించి మరీ కొనుగోలు చేసింది. బుధవారం జరిగిన లాటరీ డ్రాలో ఆ బాలిక రూ.10 లక్షలు గెలుచుకుంది. ఆ విషయం తెలిసిన వెంటనే జమాల్ సింగ్ కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది. లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని తన తండ్రి వ్యాపారాన్ని మెరుగుపరచడానికి వినియోగిస్తామని హర్సిమ్రన్ కౌర్ తెలిపింది. దాంతో పాటు తన చెల్లెళ్ల చదువు కోసం వెచ్చిస్తామని చెప్పింది.
రూ.100 లాటరీ టికెట్ కు రూ.10 లక్షల జాక్పాట్ !
July 14, 2022
0
Tags