బోరు బావిలో పడిన బాలుడు సురక్షితం !

Telugu Lo Computer
0


ఛత్తీస్ గఢ్ లోని జాంజ్‌గిర్-చంపా లో రాహుల్ సాహు అనే బాలుడు బోరు బావిలో పడ్డాడని తెలుసుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు అక్కడని చేరుకుని వెంటనే రెస్క్యూ, అపరేషన్ ప్రారంభించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు బాలుడిని సుమారు 100 గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీశారు. ఆ బాలుడికి వైద్యం అందించడానికి బిలాస్ పూర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసియూ స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో బాలుడు  సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాహుల్ సాహును రక్షించేందుకు దాదాపు 150 మంది అధికారులు రెస్క్యూ ఆపరేషన్ టీం ఎంతో కష్టపడినట్లు ఆ జిలా కలెక్టర్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)