ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం

Telugu Lo Computer
0


తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిధిలో నివసించే తొమ్మిదేళ్ల బాలికపై 44 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబసభ్యులు ఉపాధి పని నిమిత్తం వెళ్లగా బాలిక ఇంటి వద్దనే ఉంది. బాలికను ఒంటరిగా గమనించిన పక్కింట్లో నివసించే రమేష్ భోజనం పెడతానని చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి నిందితుడు పరారయ్యాడు. ఘటనతో భయాందోళను గురైన బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి తమ కూతురు ఏడుస్తూ కనిపించడంతో విషయం తెలుసుకుని హుటాహుటిన చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)