'నీలాంటి ఎస్ఐలు ఉంటే దేశం నాశనమవుతుంది.మా సోదరుడిది హత్యేనని చెప్పినా పట్టించుకోవడంలేదని' సోమాని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ధ్వజమెత్తారు. ఏఎస్పీ రోహిత్రాజు శనివారం అశ్వారావుపేట పోలీ స్స్టేషన్కు వచ్చిన నేపథ్యంలో ఆయనను మృతుడి కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తమ సోదరుడు సోమాని శ్రీను కేసులో పోలీసులు విచారణ జరపుకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరుడికి హత్యేనని, ఎస్ఐ మాత్రం ఆవైపుగా కనీసం విచారణ చేపట్టలేదని, తహసీల్దార్తో పంచనామా చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు. మద్యలో కలుగజేసుకున్న ఎస్ఐ చల్లా అరుణపై సోమాని శ్రీను కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నీలాంటి ఎస్ఐలు ఉంటే దేశం సర్వనాశనం అవుతుందంటూ' ఏఎస్పీ ఎదుటే ఆమెపై మండి పడ్డారు. బాధితుల గోడును పూర్తిగా విన్న ఏఎస్పీ రోహిత్రాజ్ ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత దర్యాప్తు వివరాలను వెల్లడిస్తామన్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సోమాని కుటుంబ సభ్యులు వెనుతిరిగారు.
నీలాంటి ఎస్ఐలుంటే దేశం సర్వనాశనం
June 05, 2022
0
Tags