సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

Telugu Lo Computer
0


తనకు ఆరోగ్యం బాగా లేదని, బెయిల్ మంజూరు చేయాలని ముంబాయి హైకోర్టును వరవరరావు అభ్యర్థించినా తిరస్కరించింది. ఈ మేరకు ముంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పార్దీవాలాతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదించారు. 82 సంవత్సరాల వయసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా.. ఇప్పటి వరకు విచారణ జరపడం లేదని సుప్రీంకోర్టుకి ఆయన విన్నవించారు. తాము దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారణకు తీసుకోవాలని సుప్రీంకోర్టును వరవరరావు తరపున న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోరారు. పిటిషన్‌ను జూలై 11న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)