టాలీవుడ్ కి పరిచయం కాబోతున్న పృథ్వి కుమార్తె శ్రీలు

Telugu Lo Computer
0


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా అబ్బాయిలు వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా వారసురాళ్ళు అంటే మంచు లక్ష్మి, జీవిత కూతుర్లు ప్రస్తుతం వారసురాళ్ళుగా కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే వీరి బాటలోనే మరొకరు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వి కుమార్తె శ్రీలు కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఈమె తండ్రి పృథ్వీ తెలియజేశారు. హోటల్ మేనేజ్ మెంట్  కోర్సు పూర్తి చేసిన ఈమె మలేషియాలో స్థిరపడాలని అనుకుంది. అయితే తనకు నటనపై ఆసక్తి ఉండటం వల్ల హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని పృథ్వీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ నా స్నేహితుడు కుమారుడు క్రాంతి హీరోగా ముగ్గురు పార్ట్నర్స్ తో కలిసి మా అమ్మాయి ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా నిర్మించారు. ఇక దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)