పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

Telugu Lo Computer
0


షాపూర్ పల్లోంజీ గ్రూపు చైర్మెన్ పల్లోంజీ మిస్త్రీ (93) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మొత్తం 18 ప్రధాన కంపెనీలతో కూడిన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఆస్తుల నికర విలువ 28.90 బిలియన్ డాలర్లు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2013లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. అయితే భారత్‌లో పుట్టి పౌరసత్వం ఉన్నప్పటికీ ఐరిస్ జాతిలో పుట్టడం వలన 2003లో భారత పౌరసత్వం వదిలి ఐరిస్ పౌరసత్వం తీసుకున్నారు. ఈ కంపెనీ అరబ్ దేశాల్లో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టింది. ముంబైలోని ఆర్బీఐ భవనం, తెలంగాణలోని కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాలను ఈ సంస్థే నిర్మిస్తోంది. టాటా గ్రూపులో ఈయన కంపెనీకి 18 శాతం వాటా ఉంది. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

Post a Comment

0Comments

Post a Comment (0)